Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకిరీల చెర నుంచి యువతిని రక్షించిన రైల్వే మంత్రి

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (14:34 IST)
రైలులో భోపాల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న యువతిని రైల్వే మంత్రి ఆదుకున్నారు. ఇబ్బందులలో ఉన్న యువతి సోదరుడి ట్వీట్ మేరకు మంత్రి గారు వెంటనే చర్య తీసుకున్నారు. పోలీసులను పంపి ఆమెను కాపాడారు. విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళుతున్న ట్రైన్ నంబర్ 22415 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువతి భోపాల్ నుండి న్యూఢిల్లీ వెళ్తోంది. 
 
ఇంతలో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి ఆమె ఉన్న బోగీలోకి ప్రవేశించారు. మహిళను అల్లరి చేయడం మొదలు పెట్టారు. బాధితురాలి సోదరుడు నిస్సహాయ స్థితిలో రైల్వే మంత్రికి ట్వీట్ చేసాడు. నా చెల్లిని కాపాడండి, నేను ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాను, కొందరు పోకిరీలు వచ్చి నా చెల్లిని అల్లరి పెడుతున్నారు. ఆమె ట్రైన్ నంబర్ 22415లో ఉంది. నేనిప్పుడు రాంచీలో ఉన్నాను అని అభ్యర్థించాడు. 
 
ఈ సందేశాన్ని స్వీకరించిన వెంటనే రైల్వే మంత్రి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆ మహిళను వెంటనే రక్షించమని ఆగ్రా పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత మంత్రి బాధితురాలి సోదరుడికి తిరిగి ట్వీట్ చేసి మీరు నిశ్చింతగా ఉండండి, మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. కాసేపటికి పోలీసులు బోగీలోకి ఎక్కి పోకిరీలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడికి తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments