Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమణదీక్షితులు గారూ... మీరు శ్రీవారి సేవ చేస్తున్నారా, జగన్ సేవ చేస్తున్నారా? ఎవరు?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:40 IST)
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతి జనసేన పార్టీ నాయకులు. శ్రీవారి సేవ వదిలేసి రమణదీక్షితులు జగన్ సేవ మొదలెట్టారని మండిపడ్డారు. వైసిపి కండువా కప్పుకుని ఆ పార్టీ అధికార ప్రతినిధిగా రమణదీక్షితులు మాట్లాడొచ్చు అన్నారు.
 
రమణదీక్షితుల వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు తింటున్నాయని.. శ్రీవారి సేవలో ఉన్న వ్యక్తికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. రమణదీక్షితులను వదిలేస్తే తిరుమలలో జగన్‌మోహన్ రెడ్డికి గుడి కట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. వేరే పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావడం వైసిపి వ్యూహమని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ముందు తేల్చుకుంటామన్నారు. 
 
పవన్ కళ్యాణ్ పర్యటన తరువాత వైసిపి నేతలకు నిద్ర లేకుండా పోయిందని, అందుకే అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. మంత్రులకు భయం కాబట్టే తిరుపతిలో తిష్టవేసి జనసేన.. బిజెపిపై లేనిపోని విమర్సలు చేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments