Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (14:33 IST)
ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది. చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్‌ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 
 
గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. రాత్రి 12 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొందరికి శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది పాపదేనని గుర్తించారు. 
 
పోస్ట్‌మార్టం చేయించారు. బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు పంచనామాలో తేలింది. బాధితురాలి ఇంటి ప్రక్కన ఉన్న బిహార్‌కు చెందిన ఆరుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments