Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథసప్తమి రోజున శ్వేతనాగు సూర్య నమస్కారం... ఫోటో

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించారు. సూర్యుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తరించారు. అరసవల్లి, తిర

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (12:15 IST)
రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించారు. సూర్యుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తరించారు. అరసవల్లి, తిరుమలలో జరిగిన రథసప్తమి ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో భద్రాచలం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రథసప్తమి రోజున శ్వేతనాగు, సూర్య నమస్కారం చేస్తూ కనిపించిందని అటవీ శాఖాధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏమిటంటే.. భద్రాద్రి సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో పులులను లెక్కించేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. సూర్యోదయం సమయంలో అరుదుగా కనిపించే శ్వేతనాగం.. పడగవిప్పి.. రెండు అడుగుల మేర పైకి లేచి.. సూర్యుని వైపు నిలబడి కనిపించింది.
 
అధికారుల అలికిడి విన్నప్పటికీ, కదలకుండా అలాగే నిలబడింది. ఈ దృశ్యాన్ని అధికారులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. సూర్యునిని అలా చూశాక శ్వేతనాగు పక్కనే వున్న పొదల్లోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments