Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... 12 మంది అరెస్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:52 IST)
చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను ఆ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనందుంగల విలువ రూ.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ దుంగలను తరలిస్తున్నందుకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఎర్ర చందనం పట్టుబడుతుంది. 
 
మంగళవారం చిత్తూరు నుంచి తమిళనాడుకు తరలిపోతున్న రూ.3 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, మురుగేశన్, పెరుమాళ్ వెంకటేష్, కరియ రామన్, కలంజన్, వెంకటేష్ ఆర్. గోవిందరాజులు అనే వారిని అరెస్టు చేశారు. 
 
మరో ఘటనలో తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న ఒక మినీ వ్యానును తనిఖీ చేయగా, అందులో రూ.4 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దేవన్ అలియాస్ నాగరాజ్, వైద్యలింగం, నజీర్ బాషా, ముత్తురామన్‌ అనే వారిని అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారిగా భావిస్తున్న సెంథిల్ కుమార్ అనే బడా స్మగ్లర్ పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments