Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌ఎంపీలూ.. ఇలాగైతే శిక్ష తప్పదు: వైద్య శాఖ హెచ్చరిక

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:44 IST)
జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలన్నారు. 

జిల్లాల్లో ఆర్‌ఎంపీలు కరోనాకు సంబంధించిన వైద్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆదేశాలను పాటించకుంటే ఆర్‌ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన ఓపీలు మాత్రమే నడుస్తాయని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రత్యేక ఓపీని నడిపించాలన్నారు. "గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలి. దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారమివ్వాలి. ఉత్తర్వుల్ని ఉల్లంఘించే  ఆర్.ఎం.పిలపై చర్యలు తప్పవు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేసింది.  4 రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు అందుబాటులో వున్నాయి" అని జవహర్‌రెడ్డి  పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments