Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూసీ కాల్వలో దూసుకెళ్లిన ట్రాక్టరు.. 14 మంది కూలీలు మృత్యువాత

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పిన ట్రాక్టరు రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పిన ట్రాక్టరు రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాక్టరులో ప్రయాణిస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మృతులంతా వలిగొండ మండలం నందనం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
 
ప్రమాదానికి గురైన ట్రాక్టరులో 30 మంది వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం వీళ్లు ట్రాక్టరులో వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments