Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్‌ను అలా వాడుకుంటున్న రోజా..?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (21:52 IST)
సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక సమాచారం ప్రజలకు చేరాలంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. టీవీ ఛానళ్ళ రిపోర్టర్లు వస్తారు.. వారు కవరేజ్ చేస్తేనే జనంలోకి వెళుతుందని అందరూ ఇంతకుముందు అనుకునేవారు. కానీ అలాంటి పరిస్థితి తగ్గిందనేది అందరికీ దాదాపుగా తెలిసిన విషయమే.
 
నగరి ఎమ్మెల్యే, ఎఐసిసి ఛైర్ పర్సన్ రోజా కూడా సామాజిక మాథ్యమాన్నే నమ్ముకున్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక మూలన ఉన్న నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రోజా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాను తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో అక్కడి కార్యక్రమాలు జనాలకు తెలియాల్సిన అవసరం ఉందని రోజా అనుకున్నారు.
 
కానీ ఆమె తన నియోజకవర్గంలో పర్యటించే కార్యక్రమాలు ఏవీ జనంలోకి వెళ్ళడంలేదు. దీంతో రోజాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. తన ఫేస్ బుక్‌ పేజీలో తాను చేసే కార్యక్రమాలన్నింటినీ అప్ లోడ్ చేయడం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఇటీవలే రోజా శ్రీకారం చుట్టేశారు కూడా. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలంలో జరిగిన గ్రామ వాలంటీర్ల నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని ఫోటోలు తీసి ఆ ఫోటోలను రోజా స్వయంగా ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆమె పంపిన సమాచారాన్ని నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. రోజాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments