Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ నిమ్మగడ్డ సీరియస్, బలవంతపు ఏకగ్రీవాలపై కలెక్టర్లకు ఆదేశాలు, ఏం జరుగుతుందో?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (09:22 IST)
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ సీరియస్‌ అయ్యింది. అభ్యర్థి మినహా ఇతరులు ఉపసంహరణ పత్రం ఇస్తే తీసుకోకూడదని స్పష్టం చేసింది. అది ఉపసంహరణగా పరిగణించకూడదని తెలిపింది.

బలవంతపు ఉపసంహరణలపై పత్రికల్లో కథనాలు, ప్రసారాలు వచ్చాయని... దీన్ని కమిషన్‌ సీరియస్‌గా తీసుకుందని తెలియజేసింది.

తిరుపతి ఏడో వార్డులో నామినేషన్‌ ఉపసంహరణపై ఫోర్జరీ సంతకం చేసి ఉపసంహరణ చేసుకున్నారని వార్తలు వచ్చాయని, దీనిపై వెంటనే అభ్యర్థి ఆర్‌వో‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది.

పోలీసులు దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీనిని ఎన్నికల నేరంగా పరిగణిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటామని, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఈసీ దృష్టికి తీసుకురావాలని కోరింది. జాయింట్‌ సెక్రటరీ ఫిర్యాదులను తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఈసీ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments