Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి.. కాపాడావా.. తిరుమలలో శేఖర్ రెడ్డి...

నోట్ల రద్దు సమయంలో 2 వేల రూపాయల కొత్త నోట్లను కోట్ల రూపాయలు మార్పిడి చేసి జైలు పాలయ్యారు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి. అప్పట్లో శేఖర్ రెడ్డి వ్యవహారం పెద్ద దుమారాన్నే రేగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వ

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (21:47 IST)
నోట్ల రద్దు సమయంలో 2 వేల రూపాయల కొత్త నోట్లను కోట్ల రూపాయలు మార్పిడి చేసి జైలు పాలయ్యారు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి. అప్పట్లో శేఖర్ రెడ్డి వ్యవహారం పెద్ద దుమారాన్నే రేగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన శేఖర్ రెడ్డి ఆ పరిచయంతోనే టిటిడి పాలకమండలి సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టగలిగాడు. పదవి ఉండగానే ఆయనపై ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. 
 
అయితే అప్పట్లో శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు కోట్ల రూపాయల కొత్త నోట్లను గుర్తించారు. ఆ కేసులో శేఖర్ రెడ్డి జైలు శిక్ష అనుభవించగా తాజాగా చెన్నై హైకోర్టులో వచ్చిన తీర్పుతో ఆయన బయటకు వచ్చేశారు. నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శేఖర్ రెడ్డి. అర్థరాత్రి దాటిన తరువాత తిరుమలకు వచ్చిన శేఖర్ రెడ్డి స్వామివారిని దర్శించుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనతో పాటు మరో ఇద్దరిని తోడుపెట్టుకుని శేఖర్ రెడ్డి తిరుమలకు వచ్చారు. మీడియాతో మాట్లాడకుండా వద్దువద్దు అంటూ వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments