Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యువెలరీ షాపులోకి పాము.. పట్టుకున్న ఓనర్.. కాటేసింది.. చివరికి?

Webdunia
బుధవారం, 26 మే 2021 (17:27 IST)
చాలామంది పాములను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. కొందరు మాత్రం దైర్యంగా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తారు. అయితే ఆలా దూరంగా వదిలేద్దామని దుకాణంలోకి వచ్చిన పామును పట్టుకున్న ఓ వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు విధించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బైరెడ్డిపల్లె మెయిన్ రోడ్డులో ఉన్న జ్యువెలరీ షాపులోకి ఓ పాము వచ్చింది. పాము యజమాని దానిని చూసి బయటకు వచ్చాడు.
 
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆసాదుల్లా (52) దుకాణంలో ఉన్న పామును చూసి దానిని పట్టుకున్నాడు. కొద్దిసేపు దానితో చలగాటమాడాడు. పాము తలను చేతిలో పట్టుకుని ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆసాదుల్లా చేతిపై కాటు వేసింది. దీంతో అతడు పామును చంపి ఆసుపత్రికి వెళ్ళాడు. పరిస్థితి విషమించడంతో గుట్టూరు జేఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పలమనేరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. 
 
కాగా నిర్లక్ష్యం నిండుప్రాణం తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఆసాదుల్లాకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి మరణించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments