Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసా కాపాడు, తిరుమలలో చిరుతలు.. పాములు

Webdunia
గురువారం, 15 జులై 2021 (20:42 IST)
లాక్ డౌన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈమధ్యే భక్తుల రద్దీ కాస్త పెరుగుతోంది. అయితే భక్తుల సందడి లేకపోవడం.. తిరుమల నిర్మానుష్యంగా మారిపోవడం.. ఘాట్ రోడ్లలో వాహన రాకపోకలు తక్కువగా ఉండడంతో జంతువులు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి.
 
గత వారం చిరుత పులులు భక్తులకు కనిపించిన విషయం తెలిసిందే. రెండవ ఘాట్ రోడ్డులోని వినాయకుని గుడి దగ్గర చిరుత రోడ్డు దాటుతూ భక్తుల సెల్ ఫోన్‌కు దొరికింది. అలాగే  తిరుమలలోని సన్నిధానం సదన్-2 దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. చిరుతపులుల తిరుగుతుండటంతో  భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే తాజాగా పాములు కూడా భక్తులు తిరిగే ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. తిరుమలలోని జిఎన్‌సి టోల్ గేట్ వద్ద అతి పెద్ద నాగుపాము రోడ్డుపైకి వచ్చేయడంతో భక్తులు గుర్తించి టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన టిటిడికి చెందిన పాములు పట్టే భాస్కర్ అక్కడికి చేరుకున్నారు.
 
అయితే నాగుపాము బుస్సలు కొడుతూ అక్కడి నుంచి వేగంగా వెళుతూ కనిపించింది. దీంతో పాముల భాస్కర్ నాగుపామును పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments