Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానికి దీనికి లింకు లేదురా మొగడా: బీజేపీ నేత సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:15 IST)
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు, ఏపీ ప్రత్యేక హోదాకు ఎలాంటి లింకు లేదని బీజేపీ రాష్ట్ర
శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కేంద్ర హోం శాఖ కీలక చర్చలు జరుపనుంది. ఇందులో చర్చించేందుకు ఎనిమిది అంశాలు చేర్చారు. ఆ తర్వాత వీటిని ఐదింటికి మార్చారు. దీనిపై వైపాకా నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరిసంహా రావుల హస్తముందని ఆరోపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ శాఖ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ప్రత్యేక హోదా అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశమన్నారు. కానీ, ఈ అంశాన్ని వైకాపా పాలకులు రాజకీయం చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఈ నెల 17వ తేదీన కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కేంద్ర హోం శాఖ జరుపుతున్న చర్చలు మాత్రమేనని చెప్పారు. ఇక్కడ ప్రత్యేక హోదా అంశంపై చర్చకు రాదన్నారు. అయితే, హోం శాఖ విడుదల చేసిన ప్రకటనలో పొరపాటున ఆ అంశాన్ని చేర్చారని ఆయన వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments