Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల ధరలపై త్వరలో ఏపీ సర్కారు కీలక ప్రకటన

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ల ధరల విషయంపై ప్రభుత్వం కీలక జీవోను సిద్ధం చేసింది. దీన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. త్వరలోనే వరుసగా తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలోని 13మంది సభ్యులతో కూడిన కమిటీ తాజాగా సమావేశమైంది. 
 
ఇందులో సినిమా టిక్కెట్లు, థియేటర్‌లో చిరుతిళ్ల ధరలు, భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించి టిక్కెట్ ధరలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత పలువురు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. "అటు ప్రజలు, ఇటు సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలకు మేలు చేకూరేలా సినిమా టిక్కెట్ ధరలపై ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేసి సమర్పించనున్నాం. ప్రభుత్వం ఎలాంటి ధరను ఫిక్స్ చేస్తుందో వేచి చూడాల్సివుందన్నారు. 
 
అతి త్వరలోనే ప్రభుత్వం టిక్కెట్ ధరలపై సానుకూ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. టిక్కెట ధరల విషయంపై తెలుగు ఫిలిమ్ చాంబర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తి పరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments