Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (20:39 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా జరగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

గత నెలలో నిర్వహించిన వార్షిక ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించిన తితిదే.. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి ఉత్సవాలను తిరువీధుల్లో భక్తుల మధ్య నిర్వహించాలని ముందుగా భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసింది.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెల్లడించిన కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలను ఈసారి కూడా  ఏకాంతంగానే నిర్వహించనునన్నట్లు మంగళవారం తితిదే ప్రకటించింది. ఈవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన తితిదే ఉన్నతాధికారులు పలు మార్లు సమీక్షలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే తెలిపింది.

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటం.. ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలకు 200 మందికి మించి నిర్వహించకూడదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు  స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments