Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందరాజుల గుట్టపై శ్రీవారి పాద ముద్రిక.. నామం దిద్ది పూజలు..

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (21:41 IST)
తిరుమల తిరుపతి కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో విశేషాలు తిరుమల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో శ్రీవారి పాద ముద్ర ఆనవాలు కనిపించాయి. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు రూరల్ మండలంలోని తాళంబేడు పంచాయతీ టి.వేనపల్లె సమీపంలోని ఓ గుట్టకు ఉంది. ఆ గుట్టను అందరూ గోవిందరాజుల గుట్ట అని పిలుస్తుంటారు. రెండ్రోజుల క్రితం ఆ గుట్టలో శ్రీవారి పాద ముద్రిక దర్శనమిచ్చింది.
 
చిత్తూరు-తచ్చూరు హైవే కాంట్రాక్టర్ మట్టి కోసం ఈ గుట్ట సమీపంలో తవ్వుతున్నాడు. ఇదే సమయంలో స్థానికులు కూడా ఆ మట్టి పనులను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో మట్టి తవ్వుతుండగా శ్రీవారి పాద ముద్ర కనిపించింది. దీంతో ఆ గుట్టలో శ్రీవారి పాదముద్ర ఉందంటూ స్థానికులు ఆ గుట్టకు నామాలు దిద్ది పూజలు చేశారు. 
 
ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే పాదం ఆనవాలు కనిపించడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది అంతా వెంకటేశ్వరస్వామి మహిమ అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments