విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 5న రాష్ట్ర బంద్ : లెఫ్ట్ పిలుపు

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (09:39 IST)
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మార్చి 5న  బంద్‌కు ఇచ్చిన పిలుపును బలపరుస్తున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి. బంద్‌ను జయప్రదం చేయాలని అన్ని తరగతుల ప్రజానీకాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 
 
ఆనాడు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌కు అమ్మడానికి పూనుకోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు విషయంలో మోసం చేసిన బీజేపీ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ప్రజలకు మరోసారి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గమన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మార్చి 5న బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా, మార్చి 5న బంద్‌కు అన్నివర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నిమగ్నమైంది. 
 
శనివారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments