Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పాఠశాలలపై కరోనా పంజా : విద్యార్థులకు - టీచర్లకు పాజిటివ్

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలపై కరోనా పంజా విసిరింది. అనేక పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ వైరస్ సోకింది. ఒకవైపు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. 
 
ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చి కరోనా తీవ్రత తగ్గుతుందని అంతా ఆశిస్తున్న వేళ మళ్లీ కేసులు పెరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. 
 
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన పాఠశాలలు వారం రోజుల క్రితం తెరుచుకున్నాయి. అయితే స్కూళ్లు పునఃప్రారంభమైన వారం రోజులకే విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. 
 
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థు ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 
 
అలాగే, కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శుక్రవారం పాఠశాలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో పది మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
 
చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు వైరస్ సోకింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం కాపుగున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసీ కండ్రిగలోని ప్రాధమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థినులకు కొవిడ్ సోకింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోనే పిల్లలకు వైరస్ సోకడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments