Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు విద్యార్థుల మృతి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:45 IST)
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ఘోరం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి చిలకలూరు పేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలిలోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. 
 
విజయవాడలోని ఓ కాలేజీలో ఆర్కిటెక్చర్ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమ్ రెడ్డి (విజయవాడ), చైతన్య, పవన్ (కాకినాడ), సౌమ్యిక (విశాఖ)లు ఓ కారులో చిలకలూరిపేటకు బయలుదేరారు. ఈ కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. కారు వేగంగా వస్తుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments