Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా క్షమాపణ లేఖ ఇచ్చారా? ఏదీ ఇక్కడ ఇవ్వగలుగుతారా? సుప్రీంకోర్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నం

Webdunia
గురువారం, 6 జులై 2017 (15:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పైన సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది. కేసు హైకోర్టులో పెండింగులో వున్నందున ఈ కేసు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టీకరించింది. 
 
కాగా ఎమ్మెల్యే అసెంబ్లీ ఘటనపై క్షమాపణలు చెపుతూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని సుప్రీంకోర్టుకు రోజా తరపు న్యాయవాది విన్నవించారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది... తమకు ఆ లేఖ అందలేదని వెల్లడించారు. దీనితో సుప్రీంకోర్టు... ఏదీ ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా అని ప్రశ్నించింది. 
 
దీనితో సుప్రీంకోర్టు సమక్షంలో రోజా క్షమాపణలు తెలుపుతూ రాసిన లేఖను ప్రభుత్వ తరపు న్యాయవాదికి అందించారు. అనంతరం ఆ లేఖను సంబంధిత అధికారులకు పంపాలని ఆదేశించింది. మరోవైపు కేసును హైకోర్టు విచారించి, తీర్పు వెల్లడించిన తర్వాత ఇక్కడకు రావచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం