Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

సెల్వి
శనివారం, 18 మే 2024 (14:25 IST)
కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించేందుకు ఆ యువతి ఆస్పత్రిలో చేరింది. అయితే ఆ యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మరణించి ఒక రోజు గడిచినా యువతిని వెంటిలేటర్‌పై ఉంచామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టి శుక్రవారం మరణించినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. 
 
విజయవాడ గాంధీనగర్‌కు చెందిన పేర్ల లక్ష్మీ వెంకట రితిక (18) నందిగామ మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతోంది. రితికకు చిన్నప్పటి నుంచి కాళ్లు వంకరగా వుండటంతో 2019లో విజయవాడ నగరంలోని ఓ ఆస్పత్రిలో సర్జరీ చేసి ప్లేట్లు అమర్చారు. 
 
ఈ క్రమంలో కాలిలోని ప్లేట్లను తీసేయాలని వైద్యులు సూచించడంతో సర్జరీ కోసం బుధవారం యువతిని ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు. అయితే మత్తు వికటించిందని వెంటిలేటర్‌పై వుంచామని చెప్పి.. చివరికి రితిక మరణించిందని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబీకులు బాధలోనే ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments