Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (11:55 IST)
చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం చుక్క వారి పల్లి సమీపంలోని శ్రీ సిద్ధగిరి క్షేత్రం శ్రీ భగవాన్ రామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగుల్లో ఒకరు స్వామిజీని హతమార్చినట్లు అదే ఆశ్రమంలోని మహిళా వృద్ధురాలు చెబుతున్నారు.

ఆ దుండగుడు తనపై కూడా అత్యాచారయత్నానికి ప్రయత్నించాడి... తప్పించుకుని ముళ్లపొదల్లో దాక్కున్నట్లు ఆమె తెలిపారు. స్వామీజీ అనుమానాస్పద మృతిలో మరో కోణం వినిపిస్తోంది. శ్రీవారి భక్తులకు అన్నదానం చేసేందుకు అచ్యుతానంద స్వామి కొనుగోలు చేసిన భవన వివాదమే ఆయన ప్రాణం తీసిందని సోదరుడు ఆరోపిస్తున్నారు. 

శ్రీవారి భక్తులకు అన్నదానం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పూతలపట్టు మండలంలోని మిట్టూరు వద్ద ఒక భవనాన్ని స్వామీజీ కొనుగోలు చేశారు. సంవత్సరాలు గడిచినా ఇంటిని అమ్మిన వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో హత్యకు దారితీసి ఉంటుందని స్వామీజీ సోదరుడు శ్రీరాములు రెడ్డి చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments