Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలి : పరిపూర్ణానంద స్వామి

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:32 IST)
దేశంలోని పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం హిందువులు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు. అదేసమయంలో దేశంలో హిందూ పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఈ వ్యాఖ్యలను జగిత్యాలలో చెబుతున్నానని అంటే జగమంతా చెప్పినట్టేనని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో సోమవారం జరిగిన వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో హిందూ పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువులుగా జీవించేవారికి, హిందువులు కాకపోయినప్పటికీ హిందువులను, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలని కోరారు. 
 
జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని అందుకనే ఇక్కడే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ అంశం దేశ వ్యాప్తంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క దానికి ఆధారమైన ఆధార్ కార్డులను ఎవరికిపడితే వారికి ఇవ్వరాదని ఆయన కేంద్రాన్ని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments