Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తిరుమలేశుని దయతో బ్రతుకుతున్నా, అందుకే 3 కోట్లతో శంకుచక్రాలు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:05 IST)
ఓం నమో వేంకటేశాయ. ఆ తిరుమల వేంకటేశుని దివ్యమంగళరూపం ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరనది. భక్తుల పాలిట కల్పతరువై ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ శక్తికొలది కానుకలు సమర్పించుకుంటూ వుంటారు. బుధవారం తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు భారీ కానుక సమర్పించాడు. శ్రీవారికి శంకుచక్రాలను చేయించి సమర్పించాడు.
 
వీటి విలువ సుమారు రూ .2 కోట్లు వుంటుందని అంచనా. 3.5 కిలోల బంగారంతో స్వామి కోసం శంకు, చక్రాలను తయారు చేసినట్లు తంగదొరై వెల్లడించారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఆభరణాలను సమర్పించారు.
తంగదొరై గతంలో కూడా శ్రీవారికి బంగారు, వజ్రాల ఆభరణాలను కానుకగా ఇచ్చారు. వాటిలో బంగారు వడ్డాణం, బంగారు చేతులు, హారము ఉన్నాయి. తిరుమల బాలాజీకి ఎప్పుడూ చాలా విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తూనే వుంటారు.
 
భక్తులు బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాలు, భూములను అర్పిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు నగదు రూపంలో భారీ కానుకలు ఇచ్చారు. ఆ విధంగా భక్తులు వివిధ రూపాల్లో వెంకటేశ్వరస్వామికి కానుకలు ఇవ్వడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments