Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో రోడ్డు ప్రమాదం : అయ్యప్ప భక్తుల మృతి

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (18:05 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ వాసులుగా గుర్తించారు. 
 
పుదుక్కోట రహదారిపై 16 మందితో అయ్యప్ప భక్తులతో వస్తున్న కారును కంటైనరుతో వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతులంతా మెదక్ జిల్లా నర్సాపూర్‌ వాసులుగా గుర్తించారు. మృతులను నాగరాజు, మహేశ్, శ్యామ్, ప్రవీణ్, సాయి, ఆంజనేయులు, సురేశ్, కృష్ణగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను తిరుమయం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments