Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ వన్‌టైమ్ సీఎంగా మిగిలిపోతారు : లంకా దినకర్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సెటిల్మెంట్ సీఎంగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేత లంకా దినకర్ జోస్యం చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.10 వేల చొప్పున వన్ టైమ్ సెటిల్మెంట్ వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
ఈ వ్యవహారంపై ఏపీలో రగడ కొనసాగుతోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌లో ఒకే మొత్తంలో రుణ బకాయిలు చెల్లించి జగనన్న సంపూర్ణ స్వగృహ పథకం ద్వారా లబ్దిదారులు ఇళ్ళపై పూర్తి హక్కులు పొందాలని ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీనిపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 
 
దీనిపై టీడీపీ నేత లంకా దినకర్ స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే వ్యాపారం ఎక్కువై పోయిందని చెప్పారు. సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాల పాత గృహ లబ్దిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్‌గా మారారని, ఈయన కూడా ఓటీఎస్ ముఖ్యమంత్రిగా మారిపోతారని లంకా దినకర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments