Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మహానాడు ఒక్క రోజు మాత్రమే.. వేదిక ఒంగోలు

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:04 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడును ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని తీర్మానించారు. ఈ మహానాడుకు ఒంగోలు వేదికకానుంది. 
 
సాధాణంగా పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ.రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి యేడాది మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్చువల్ విధానంలోనే ఈ పార్టీ మహానాడును నిర్వహిస్తూ వచ్చారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ యేడాది ఒంగోలు కేంద్రంగా ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒంగోలు నగర శివారు ప్రాంతాల్లో ఈ మహానాడును నిర్వహించనున్నారు. అంతకుముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 
 
28వ తేదీన నిర్వహించే మహానాడుకు ప్రతి ఒక్కరూ హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే, ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారభించి వీటిని ఒక యేడాది పాటు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments