Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాలు.. టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా : రైల్వే అధికారులపై రాయపాటి ఫైర్

రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:14 IST)
రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వే అధికారులు ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉన్నారన్నారు. 
 
తమ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ రాయపాటి మాట్లాడుతూ... రైల్వే అధికారులు చిన్నచిన్న పనులు కూడా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలు తమను చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. భోజనం, టిక్కెట్ కోసం సమావేశాలకు వస్తారా అని మండిపడ్డారు.
 
తాను మాట్లాడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినప్పటికీ తాను మాట్లాడుతానని చెప్పారు. రైల్వే అధికారులు ప్రధాని కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలుత రైల్వేజోన్ రావాల్సి ఉందని రాయపాటి అన్నారు. రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమని రాయపాటి ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments