Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేకు తలాక్.. తలాక్.. తలాక్ అంటూ టీడీపీ ఎంపీల నినాదాలు (వీడియో)

కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి అధికార తెలుగుదేశం పార్టీ వైదొలగింది. ఆ తర్వాత ఢిల్లీతో పాటు.. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా, టీడీపీకి చెందిన ఎంపీలు మరింత ఘాటుగా ప్రధాని నరేంద్ర

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (11:43 IST)
కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి అధికార తెలుగుదేశం పార్టీ వైదొలగింది. ఆ తర్వాత ఢిల్లీతో పాటు.. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా, టీడీపీకి చెందిన ఎంపీలు మరింత ఘాటుగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే, పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద చేరి ఆందోళన చేశారు. ఎన్డీయేకు తలాక్.. తలాక్... తలాక్ అంటూ వారు నినాదాలు చేశారు. 
 
అంతకుముందు... శుక్రవారం ఉదయం చంద్రబాబునాయుడు ఆదేశించినట్టుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్‌సభ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితం అందించారు. నోటీసులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆపై మీడియాతో మాట్లాడిన తోట నరసింహం, ఆంధ్రప్రదేశ్‌పై, తెలుగుదేశం పార్టీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. తమ అధినేత అవిశ్వాసంపై ఇతర పార్టీల మద్దతు కోసం చర్చిస్తున్నారని తోట నరసింహం వ్యాఖ్యానించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments