Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం గళం విప్పితే వారు వేడుక చూశారు, టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (23:32 IST)
వైసిపి ఎంపిల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు. తిరుపతి వేదికగా మీడియాతో రామ్మోహన్ నాయుడుతో గల్లా జయదేవ్‌లు మాట్లాడారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించాం.. గట్టిగా కేంద్రాన్ని నిలదీశాం.
 
మేము పార్లమెంటులో గళం విప్పితే వైసిపి ఎంపిలు వేడుక చూస్తూ కూర్చున్నారు. అసలు మీరు ఎంపిలేనా అంటూ మండిపడ్డారు రామ్మోహన్ నాయుడు. జగన్‌కు కేసులంటే భయమని.. కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్ ఆలోచన అంటూ విమర్సించారు. 
 
టిడిపి హయాంలోనే తిరుపతి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో అసలు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే వైసిపి నాయకులను ప్రజలు నిలదీయాలని.. టిడిపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
 
అలాగే మరో ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలంటే వైసిపికి అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్థి చేయాల్సిన బాధ్యత వైసిపి ఎంపీలకి లేదా అంటూ ప్రశ్నించారు. వైసిపి ఎంపిలతో పాటు వైసిపి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వారికి త్వరలోనే బుద్ధి చెబుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments