Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల బరిలో నందమూరి హరికృష్ణ తనయ... ఏ పార్టీ తరపునంటే...

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (07:06 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల బరిలో నందమూరి కుటుంబ వారసులారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇదే నిజమైతే.. నందమూరి కుటుంబం నుంచి ఎన్నికల్లో నేరుగా పోటీ చేస్తున్న మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. గతంలో పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్, ఆ తర్వాత ఆయన తనయుడు నందమూరి హరికృష్ణలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇపుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలోకి దిగనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. 
 
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... సుహాసినికి కూకట్ పల్లి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను పార్టీ ముఖ్యనేతలు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. 
 
ఒకవేళ, సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్‌ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది. సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌ సతీమణి. నిజానికి ఈ ఇక్కడ నుంచి హీరో కళ్యాణ్‌రాంను బరిలోకి దించాలని టీడీపీ నేతలు భావించగా, ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో సుహాసిని పేరును తెరపైకి తెచ్చారు. 
 
మరోవైపు, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన సీట్లలో కూకట్‌పల్లి ఒకటి. ఈ సీటుకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అలాగే, మరో మూడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నాలుగు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments