Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయ్... నా.. కొ.. కా... మరదలిని పెళ్లి చేసుకున్న భర్తకు భార్య బడిత పూజ

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:27 IST)
తొలి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్తకు ఓ భార్య బడిత పూజ చేసింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఆ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజ అనే మహిళతో వివాహమైంది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీంతో ఆమెను మానసికంగా వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని శైలజ.. భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లింది .
 
ఇదే అదునుగా భావించిన సాంబశివరావు భార్యకు తెలియకుండా మరదలి వరుస అయ్యే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ ఆగ్రహంతో రగిలిపోయింది. తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది.
 
అంతేనా, విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త పట్టుకుని ఉతికి ఆరేసింది. రెండో భార్యతో ఏకాంతంగా భర్త ఉన్నపుడు ఇంటిపై దాడి చేసి ఆయన్ను పట్టుకుంది. ఆ తర్వాత భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి పట్టుకుని చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సాంబశివరావును రక్షించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments