దొంగచాటు పడకసుఖం ఇవ్వాల్సిందేనంటూ మహిళకు నిప్పు

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (12:44 IST)
తనతో కుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగంచాలంటూ ఓ మహిళను ఓ వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో ఆ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా తండూరుకు చెందిన అంజిలమ్మ (40) అనే మహిళతో అగ్గనూరు గ్రామానికి చెందిన నర్సింహులు (45) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, కొన్ని రోజులుగా అంజిలమ్మ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆగ్రహించిన నర్సింహులు.. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. 
 
ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి 11 గంటలకు ఆమెపై కిరోసిస్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. అనంతరం నర్సింహులు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. వారివద్దరికీ తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఈ రోజు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజిలమ్మ కుటుంబ సభ్యులపై కూడా నర్సింహులు కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments