Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు అకాడమీ తెదేపా అకాడమీ కాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్‌

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:22 IST)
తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు.

తెలుగు భాష అభివృద్ధి, మరింత విస్తృతం చేసేందుకే కేబినెట్‌లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ద్రవిడ భాష నుంచి ఆవిర్భవించిన తెలుగులో పరిశోధన కోసం సంస్కృతాన్ని జోడించి అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

తెలుగు అకాడమీ తెలుగుదేశం పార్టీ అకాడమీ కాదని ఆ పార్టీ నేతలు గుర్తించాలని.. తమ విమర్శలు సరిచేసుకోవాలని హితవు పలికారు. తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయిందని మంత్రి ఆరోపించారు. సంస్కృతం భారతీయ భాషలకు మూలమన్నారు.

దీని ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువ ఉంటుందని.. రెండింటినీ వేర్వేరు భాషలుగా చూడలేమని వివరించారు. తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

విభజన తర్వాత రెండేళ్లలో తెలుగు అకాడమీని ఏపీలో ఏర్పాటు చేయలేకపోయారని.. అందుకే ఇప్పుడు రెండింటినీ కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments