Webdunia - Bharat's app for daily news and videos

Install App

130 కోట్ల భారతీయుల సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది: కేంద్రమంతి పియూష్ గోయల్

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (21:02 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి పియూష్ గోయల్. ఆలయం వద్ద టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయక మండపంలో కేంద్రమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
ఆలయం వెలుపల కేంద్రమంత్రి పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ 130 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం ఏమిటో ప్రపంచం చూస్తోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా భావించి 450 దేశాలకు మెడిసిన్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
 
75 దేశాలకు కరోనా వ్యాక్సిన్ భారత్ నుంచి అందించామన్నారు. స్వీయ నియంత్రణ, ఎల్లవేళలా మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ పరిశుభ్రమైన తిరుమలగా అధికారులు తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. 
 
80 శాతం రైల్వే సేవలు ఇప్పటికే ప్రారంభించామని.. త్వరలో పూర్తిస్థాయిలో రైల్వేసేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో పలు అభివృద్థి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని... తిరుపతి ఇతర ప్రాంతాల మధ్య అధికంగా రైళ్ళు నడిచేలా అదనపు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments