Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపికి ఇదే చివరి ఛాన్స్: యనమల

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (07:59 IST)
రాష్ట్ర నూతన కమిటి సభ్యులను పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అభినందించారు. కొత్త కమిటిలో 61% పదవులు బిసి,ఎస్సీ,ఎస్టి ముస్లిం మైనారిటీలకే ఇవ్వడం ముదావహం అన్నారు.

బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం అనేది మరోసారి రుజువైంది. నూతన కమిటి టీమ్ స్పిరిట్ తో పని చేయాలని, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. 

‘‘టిడిపిపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించి వైసిపి అధికారంలోకి వచ్చింది. ఒక్కఛాన్స్ అని కాళ్లావేళ్లా పడి బతిమాలి, అధికారం పొందిన వైసిపి అనేక అరాచకాలకు పాల్పడి, అదే చివరి ఛాన్స్ చేసుకుంది.

బిసిలపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు-దౌర్జన్యాలతో అన్నివర్గాల ప్రజలకు దూరం అయ్యింది. పేదల సంక్షేమ పథకాల్లోనూ వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడింది.

వాటాల కోసం బెదిరించి పారిశ్రామిక వేత్తలను తరిమేసింది, యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టింది. వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. రైతులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, కులవృత్తులవారు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని’’ యనమల రామకృష్ణుఢు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments