Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆ రోజుల్లో కూడా శ్రీవారి దర్శనం...

శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగష్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మహాసంప్రోక్షణ బాలాలయంను నిర్వహించేందుకు టిటిడి సిద్థమైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భక్తులెవరినీ దర్శనానికి అనుమతించకూడదన్న నిర్ణయం కూడా తీసేసుకుంది. దీనిప

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (19:18 IST)
శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగష్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మహాసంప్రోక్షణ బాలాలయంను నిర్వహించేందుకు టిటిడి సిద్థమైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భక్తులెవరినీ దర్శనానికి అనుమతించకూడదన్న నిర్ణయం కూడా తీసేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి సంప్రోక్షణ జరిగే సమయంలో కూడా భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించాలని ఆదేశించారు. దీంతో టిటిడి పాలకమండలి తిరుమలలో సమావేశమైంది.
 
ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆగష్టు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాసంప్రోక్షణ జరుపనున్నట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు. 11వ తేదీ 9 గంటల సమయం, 12వ తేదీ 4 గంటల సమయం, 13వ తేదీ 4 గంటల సమయం, 14వ తేదీ 6 గంటల సమయం, 15వ తేదీ 5 గంటల సమయం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మిగిలిన సమయాల్లో మహాసంప్రోణ నిర్వహించనున్నారు. సంప్రోక్షణ సమయంలో సిఫార్సుల లేఖలను స్వీకరించకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments