Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల కమీషన్ ఏం చేస్తోంది? బతికివుందా? లేక చచ్చిపోయిందా?

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:16 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? బతికివుందా? చచ్చిపోయిందా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఉప ఎన్నికలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు బయటి ప్రాంత వ్యక్తులు తిరుపతినిలో తిష్టవేశారని ఆరోపించారు. వారిని అరెస్టు చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు.

అయినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల కమీషన్ ఏం చేస్తోంది? బతికివుందా? లేక చచ్చిపోయిందా? రేపు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల మధ్య రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది. పటిష్ఠమైన బందోబస్తు అవసరం. దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు. 
 
పోలీసు సహాయంతో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు పక్క సమాచారం అందింది. ధర్మ యుద్ధంలో ఓడిపోతామని తెలిసి, జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ధర్మయుద్ధం జరిగితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments