Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 12,608 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (12:40 IST)
దేశంలో కొత్తగా మరో 12 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 3.62 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే మూడు వేల కేసులు అధికం కావడం గమనార్హం. 
 
గత 24 గంటల్లో 12608 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటితో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 4,42,98,864 మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో 4,36,70,315 మందికి బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 72 మంది మరణించగా, 16,251 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments