Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ9 నకిలీ విలేకరి అరెస్ట్; బ్యాగులో గంజాయిని త‌ర‌లిస్తూ...

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:39 IST)
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం లో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట్ అని చెప్పుకొంటూ, ఆ  పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని అన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. 
 
త‌ను టీవీ 9 క్రైమ్ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ, పలువురిని బెదిరించి, దుర్గాప్ర‌సాద్ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నకిలీ విలేకరి మండపేట కు చెందిన పెద్దిరెడ్డి దుర్గా ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. అన్నవరం కొండ పై ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు ఈ నకిలీ విలేకరి. యువకుడు ఫిర్యాదుతో ఈ విలేక‌రి బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
దీనితో అన్న‌వ‌రం పోలీసులు ఇత‌నిపై నిఘా పెట్టారు. ఈసారి త‌ను శంఖవరం మండలంలో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, పోలీసులు ప‌ట్టుకున్నారు. వారికి కూడా త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట‌ర్ ని అని దుర్గాప్ర‌సాద్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీనితో ఈ న‌కిలీ రిపోర్ట‌ర్ ని అరెస్టు చేసి ఊచ‌లు లెక్క‌బెట్టిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments