నైరుతి రుతుపవనాల ప్రభావం - ఏపీలో వచ్చే రెండు రోజులు వర్షాల

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, కాకినాడ, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పల్నాడు, చిత్తూరు, కృష్ణ, అన్నమయ్య, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కోనసీమ, బాపట్ల, అల్లూరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆదివారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
అదేవిధంగా ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, తిరుపతి, అనకాపల్లి జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తాయని వివరించింది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
బాలికతో 45 యేళ్ల వ్యక్తి వివాహం... 
 
తెలంగాణ రాష్ట్రంలో ఓ బాల్య వివాహం జరిగింది. 13 యేళ్ల బాలికను 45 యేళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఆ వ్యక్తికి మొదటి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇపుడు ఆయన 13 యేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
జిల్లాలోని నవీపేట్ మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి 13 యేళ్ల మైనర్ బాలికను సాయిబ్ రావు అనే 45 యేళ్ల వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అయితే, సాయిబ్ రావుకు అప్పటికే వివాహమై భార్య మృతి చెందింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం తనకంటే తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గ్రామస్థుల సహకారంతో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది.
 
దీనీపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునే సరికి.. తన భార్యను తీసుకుని సాయిబ్ రావు అక్కడ నుంచి పరారైపోయాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న సాయిబ్ రావు దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments