Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (19:55 IST)
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్య పేట  సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అవ్వడంతో పాటు ఆటో డ్రైవర్ రాము, ఆటోలో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి సాయి ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఆటోలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని  స్థానికుల సహకారంతో గాయపడ్డవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయిప్రదీప్ కోమటిపల్లి తాండ్రపాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సీతానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments