Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (09:22 IST)
ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేశారు. ఈ ఆసక్తికర సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబరియలు మండలంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, ఆమెకు సంతానం లేదు. దీంతో 2005లో అప్పలమ్మను పండన్న రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఓ బాబు పుట్టాడు. 
 
ఆ తర్వాత ఆమెకు సంతానం లేదు. అయితే, ఒక్క సంతానంతో సంతృప్తి చెందని పండన్న తమ ఇద్దరు భార్యల అనుమతితో మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గత నెల 25వ తేదీన తన ఇద్దరు భార్యలే పెళ్ళి పెద్దలుగా వ్యవహించి పెళ్లి పత్రికలు ముద్రించి, బ్యానర్లు వేయించి, ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిపై పండన్న స్పందిస్తూ, తమ కుటుంబ సంతానం వృద్ధి కోసం తమ ఇద్దరు భార్యలు పెద్ద మనసుతో త్యాగం చేసి తనకు మూడో వివాహం చేశారంటూ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments