Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనం నుంచి జారి పడి ఇద్దరు కూలీల మృతి

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:30 IST)
బొలెరో వాహనం నుంచి జారి పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

విశాఖ నుండి మచిలీపట్నంకు 28 మంది కూలీలు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. బొలెరో వెనక డోర్‌ ఊడిపోవడంతో.. అందులో ఉన్న ఆరుగురు కూలీలు రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

మరో నాలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ఏర్పడి వాహనదారులకు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments