Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విజయవాడకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:51 IST)
కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ గురువారం విజయవాడకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 
 
కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. అలాగే, కొత్తగా మరో 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇందులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారు. 
 
ఆ తర్వాత బెంజ్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడ కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ఆయన ప్రారంభిస్తారు. గుడివాడ రైల్వే గేట్లు దాటేందుకు 2.5 కిలో మీటర్ల మేరకు వంతెనను నిర్మించారు. ఇందుకోసం కేంద్రం రూ.317.22 కోట్లను మంజూరు చేసింది. ఈ పర్యటన సమయంలో ఆయన ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో కొంత సేపు గడుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments