Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (13:36 IST)
అడవుల్లో ఉండాల్సిన గజరాజులు ఊళ్లలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నానా బీభత్సం సృష్టించడమేకాకుండా, తనకు అడ్డొచ్చిన వారిని తొండంతో చుట్టి నేలకేసికొడుతుంది. కాళ్లతో తొక్కి చంపేసింది. అలాంటి సంఘటన ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్‌లోని అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ మదపుటేనుగు గ్రామంలోకి దూసుకొచ్చింది. జనం మీద పడింది. తరిమి తరిమి కొట్టింది. దొరికిన ఓ వ్యక్తిని కాలుకింద నలిపేసి చంపేసింది. ఆ ఏనుగు బీభత్సం గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామాల జనం గజగజా వణికిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆగమేఘాలపై గ్రామానికి వచ్చారు. మదపుటేనుగును అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ప్రత్యేకంగా ఓ ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఏనుగు వేట ప్రారంభించారు. మొత్తానికి దాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. 
 
ఏనుగుకు మత్తుమందు ఇవ్వడంతో మిన్నకుండిపోయింది. ఆ తర్వాత తాళ్లతో కట్టి.. తమ వాహనంలో మరో చోటకు తరలించారు. అక్కడ నుంచి ఏనుగుల శిబిరంలో దానిని వదిలేస్తామని… దాని ప్రవర్తనను గమనించి తర్వాత చర్యలు తీసుకుంటామని హరిద్వార్ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments