Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉనికి లేదనే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు : విజయశాంతి

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు ఉనికి లేదనే భావించడం వల్లే భారతీయ జనతా పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుందని తెలిపారు. 
 
అలాంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఏపీలోని ఏ ఒక్క పార్టీ ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ మద్దతు లేకుండా ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో అంతుచిక్కడం లేదన్నారు. హోదా కోసం పోరాడటంతో పాటు లక్ష్యాన్ని సాధించడానికి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ను బలపరుస్తూ తీర్మానం చేయడంమేలని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 
 
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని భావించి, కాంగ్రెస్‌కు మద్దతుపలికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తిగా తాను ఈ ప్రతిపాదన చేస్తున్నానని విజయశాంతి ట్విట్టర్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments