Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో దారుణం - సచివాలయంలో బాలికపై వలంటీర్ అత్యాచారం

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (10:13 IST)
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ పరిపాలన కోసం ఏర్పాటుచేసిన సచివాలయంలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది వలంటీరే కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం నడుకూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నడుకూరు గ్రామానికి చెందిన బి.హరిప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే సచివాలయంలో వలంటీరుగా పని చేస్తున్నాడు. గత నెల 31వ తేదీ తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న 12 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
అతడికి రాంబాబు అనే యువకుడు పూర్తి సహాయ సహకారాలు అందించాడు. లైంగికదాడి తర్వాత ఆ బాలిక అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో నిందితులిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అయితే, తన చెల్లి కనిపించకపోవడంతో బాధితురాలి అక్క గ్రామంలో గాలిస్తూ సచివాలయానికి వచ్చింది. అక్కడ అపస్మారకస్థితిలోపడివున్న చెల్లిని చూసి బోరున విలపిస్తూ కేకలు వేసింది. ఆ తర్వాత దీనిపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments