Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఐపిలు ఈ నెల 13, 14, 15 తేదీల్లో తిరుమల రావద్దండి, ఎందుకంటే?

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:28 IST)
మొట్టమొదటిసారి తిరుపతి వేదికగా సౌత్ ఇండియా కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది. కౌన్సిల్ సమావేశానికి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగనుంది. సమావేశంలో రాష్ట్రాల అభివృద్థి, కేంద్రప్రభుత్వం కేటాయించనున్న నిధుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.
 
అయితే కౌన్సిల్ సమావేశం పాల్గొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రం హోంశాఖామంత్రితో పాటు పలువురు అగ్రనేతలు వస్తున్న నేపథ్యంలో తిరుమలలో విఐపి దర్సనాలను మూడు రోజుల పాటు టిటిడి నిలిపివేయనుంది.
 
ఈ నెల 13, 14, 15 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్సనాలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ముందస్తుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నవంబరు 12, 13, 14 తేదీల్లో విఐపి బ్రేక్ దర్సనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. 
 
విఐపిలు ఆరోజుల్లో తిరుమల రావద్దని కూడా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఈ కౌన్సిల్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైలతో పాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్, తమిళనాడు సిఎం స్టాలిన్‌లు కూడా హాజరు కానున్నారు. సిఎంలు అందరూ కలిసి కేంద్రానికి ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments