Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై మద్యం మత్తులో మహిళ చీర లాగేసిన యువకులు

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (12:16 IST)
విశాఖ జిల్లాలో ఓ మహిళకు అవమానం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆమె చీర లాగేసి నలుగురిలో ఆమెను అవమానపరిచారు. అంతేకాదు, కులం పేరుతో ఆమెను తీవ్ర దుర్భాషలాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నంకు చెందిన నానిబాబు స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజుతో కలిసి ఆటోలో నర్సీంపట్నం ఆసుపత్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో వెనకాల వచ్చిన ఓ బైక్ ఆటోను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ట్రాఫిక్ సమస్య కారణంగా నాని సైడ్ ఇవ్వకపోవడంతో.. కొంతదూరం వెళ్లాక బైక్‌పై ఉన్న యువకులు ఆటోను అడ్డగించారు. 
 
ఆటోలో నుంచి నానిని బయటకు లాగి చితకబాదారు. అడ్డుకోబోయిన అతని భార్య రాజేశ్వరి చీర లాగేశారు. కులం పేరుతో దుర్భాషలాడారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులను బొడగ రామకృష్ణ, ఎలిశెట్టి రామకృష్ణలుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments